సౌదీలో ముగ్గురికి మరణశిక్ష...
- August 01, 2015
సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడిన ముగ్గురి తలలను తెగనరికారు. సౌదీ అరేబియాలో ఆ దేశానికి చెందిన అల్-దియాని, షిరో అల్-జినోబి, మన్సూర్ అల్ రోలీ అనే ముగ్గురి తలలను నరికి మరణిక్షను అమలుచేశారు. ఈ శిక్షను ముగ్గురికీ వేరు వేరు ప్రాంతాలలో అమలు చేశారు. వీరిలో దియాని, జినోబిలు హత్య కేసులో అరెస్టు చేయబడినవారు కాగా, మన్సూర్ మత్తు పదార్థాలను స్మగ్లింగ్ చేసినందుకు అరెస్టు అయ్యాడు. ముగ్గురితో కలిపి ఈ ఏడాది సౌదీలో మరణ శిక్షకు గురైన వారి సంఖ్య 107కు చేరింది. ఈ విధంగా తలలు తెగనరికి మరణశిక్షలను విధించడంపై పలు వర్గాల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత మే నెలలో తలలు తెగనరికేందుకు పనివారు కావలెను అంటూ సౌదీ ప్రభుత్వం ప్రకటన చేయడం విశేషం.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







