ఆన్లైన్ బిజినెస్లో 0.5 మిలియన్లు కోల్పోయిన దుబాయ్ మహిళ
- August 31, 2016
సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఓ ఫేక్ ఆఫర్ కారణంగా దుబాయ్కి చెందిన ఓ మహిళ 500,000 దిర్హామ్లు నష్టపోయారు. రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేయవచ్చని ఆ ఫేక్ ఆఫర్ ద్వారా దుబాయ్ మహిళను కొందరు తప్పుదోవ పట్టించారు. అత్యాశకు పోయిన ఆ మహిళ, ఇప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. 10,000 దిర్హామ్ల నుంచి 280,000 దిర్హామ్ల వరకు పలు మార్లు బాధిత మహిళ, కొందరు అక్రమార్కులక చెల్లించారు. ఆ తర్వాత అదంతా ఫ్రాడ్ అని ఆమె గుర్తించారు. ఆమెకు విషయం అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకో వైపున న్యాయనిపుణుల సూచనలతో ఇరు పార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చి, సెటిల్మెంట్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









