తెలంగాణలో జాగృతి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభం
- September 02, 2016
తెలంగాణలో జాగృతి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కేంద్ర మంత్రి రాజీవ్ప్రతాప్రూడీ ఈ శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మానవ వనరుల కోసం ప్రపంచం భారత్ వైపే చూస్తోందన అన్నారు. మోదీ స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించారని, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రాలకు రూ.3వేల కోట్లు కేటాయించినట్లు ప్రతాప్రూడీ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో నిరుద్యోగుల శాతం ఎక్కువ అని వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 12 నైపుణ్య శిక్షణాకేంద్రాలు ప్రారంభించామన్నారు. ఈ సెంటర్లన్నింటీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉందని కవిత వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







