తనిఖీలో కార్లను అద్దెకు ఇచ్చే 30 కార్యాలయాలు మూసివేత

- September 02, 2016 , by Maagulf
తనిఖీలో కార్లను అద్దెకు ఇచ్చే 30 కార్యాలయాలు మూసివేత

రియాద్: ఇటీవల రాజ్యమంతటా జరిపిన పలు తనిఖీ ప్రచారాలు రవాణా మంత్రిత్వ శాఖ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సమన్వయంతో అమలు చేశారు.వివిధ రవాణా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు వాటి సక్రమ  ఆచరణకు నిరంతర ప్రయత్నాలు ఈ పరిధిలోనికి వస్తాయి. దేశంలో రవాణా వ్యవస్థ నియంత్రణ  తనిఖీల నిబంధనలు మరియు ఏర్పాటు అవసరాలు నిర్ధారించుటకు మంత్రిత్వ శాఖ అప్రమత్తంగా ఉంది.

రవాణా మంత్రి, మార్కెటింగ్ మరియు పెంపు పై సాధారణ పర్యవేక్షకుడు మరియు మంత్రిత్వ ప్రతినిధి సలహాదారుడు తుర్కీ  అల్ టూరిమి ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంటూ, స్థానిక మీడియాలో ఈ ప్రచారాలు  అమలవుతున్నాయని,వివరించారు. బాగా అధ్యయనం జరిపిన తర్వాత ఈ ప్రణాళికలు ప్రకారం అమలుచేస్తున్నట్లు పేర్కొంన్నారు. మొదటిసారి ఒక ఎలక్ట్రానిక్ అప్లికేషన్ పద్ధతి ద్వారా అమలుచేస్తున్న ఈ విధానంలో  జట్లు ద్వారా ఉల్లంఘనలు నమోదు చేయడం వంటి ఆధునిక పద్ధతులు ఉపయోగించి తనిఖీలు చేయవచ్చు. 2,000  కంటే ఎక్కువ ఉల్లంఘనలు రవాణా కార్యకలాపాలలో నమోదు కాబడ్డాయి.అద్దె టాక్సీలలో మహిళా ఉపాధ్యాయుల ఇతర పాఠశాల రవాణా, సరుకు రవాణా సేవలను( కార్గో ) వంటి రవాణా కార్యకలాపాలు నమోదయ్యాయిని  అల్- టూరిమి  చెప్పారు.
సౌదీకరణలో భాగంగా నూతన సంస్కరణలకి లోబడి గడువు ఉన్న  లైసెన్సులతో వ్యాపార సాధన మొదలుకుని కౌలుదారు ఉద్యోగ కార్డు లభ్యత  ద్వారా విధానంని  తప్పించుకుంటూ; పత్రాలు ఫోటోలు లేకుండా  మరియు సంబంధిత  గుర్తింపు స్టికర్లు లేకుండా కార్లని  నడుపుతూ నగరంలో ఒక అనధికార కార్యాలయం ద్వారా వ్యాపారాన్ని నిర్వహించడం తనిఖీలో వెల్లడయింది.జెడ లో  తనిఖీలో కార్లను అద్దెకు ఇచ్చే 30 కార్యాలయాలు మూసివేత జరిపించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 315 ఉల్లంఘనలు హేల్ లో నమోదు కాగా,ఈ విధంగా  యాసిర్ లో  43 , నజ్రాన్ లో  662 , ఉత్తర సరిహద్దుల వద్ద 103;  ఖ్అస్సిమ్ లో 278  ; జెడ లో 400  ; మరియు ఉల్లంఘనలు రియాద్ లో  163 నమోదయ్యాయి.
          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com