విజయ్ దర్శకత్వంలో సాయేషా సైగల్
- September 05, 2016
'అఖిల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయేషా సైగల్ తమిళ చిత్ర పరిశ్రమలోకి తేరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో జయం రవి హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో సాయేషా కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించినట్లు జయం రవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా ఎగ్జైటింగ్గా ఉందని సాయేషా ట్వీట్ చేశారు. దీంతోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయం రవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. హరీశ్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన సాయేషా నటించిన 'శివాయ్' చిత్రం అక్టోబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







