తాజ్ మహల్ సమీపంలో విమానాశ్రయం
- September 05, 2016
ప్రేమమందిరానికి ప్రతీకగా నిలిచిన తాజ్మహల్ అందాలను వీక్షించేందుకు ఇప్పటి వరకు రోడ్డు.. రైలు మార్గాలనే పర్యాటకులు ఆశ్రయించారు. ఇక నుంచి విమాన సదుపాయాన్ని కల్పించనున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజ్మహల్ సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఇందుకోసం ప్రభుత్వం 150 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రూ.100కోట్ల వ్యయంతో రన్వేను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే రన్వేకు సంబంధించిన పనులు ప్రారంభించనున్నారు. .
వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు ప్రారంభిస్తామని. దీనికి సంబంధించిన స్థలాన్ని ముందే పర్యవేక్షించామని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ దీపక్ సింఘాల్ వెల్లడించారు. పర్యాటకులు దిల్లీకి వచ్చి అక్కడి నుంచి రోడ్డు.. రైలు మార్గాల ద్వారా ఆగ్రా చేరుకుంటున్నారని పర్యాటకశాఖ పేర్కొంది. తాజ్ అందాలను వీక్షించేందుకు భారత్ నుంచి 65లక్షల మంది పర్యాటకులు వస్తుండగా. ఏడు లక్షల మంది విదేశీయులు వస్తుంటారు. కాని ఆగ్రాలో తాజ్మహల్తో పాటు ఆగ్రా కోట, ఫతేఫూర్ సిక్రీ ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







