పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..
- September 07, 2016
మరికొద్దిగంటల్లో రియో డిజనీరోలోని మారకానా స్టేడియంలో పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. వికలాంగులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రియో 2016 పారా ఒలింపిక్స్ పోటీలను ఈ సారి ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 154 దేశాల్లో ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ వెల్లడించింది. టీవీ, రేడియో, ఆన్లైన్ ద్వారా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని కమిటీ సిబ్బంది తెలిపారు.2012 లండన్ పారాలింపిక్ గేమ్స్ను 115దేశాల్లో ప్రసారం చేయగా ఈసారి 30శాతంపైగా పెంచినట్లు తెలిపారు. 2012లో 3.8బిలియన్ల మంది ఈ ప్రసారాలను వీక్షించగా..ఈ సారి వారి సంఖ్య 4బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పారాలింపిక్స్ ఈ నెల 7 నుంచి 18 వరకు జరగనున్నాయి. మన దేశం తరఫున 15మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







