టీవీ సిరీస్గా బ్రూస్లీ రాసిన కథ
- September 07, 2016
బ్రూస్లీ పేరు తెలియని వారుండరు. 1940లో జన్మించిన బ్రూస్లీ 'ది బిగ్ బాస్'.. 'ఎంటర్ ది డ్రాగన్' వంటి సినిమాలు.. కొన్ని టీవీషోలు చేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. 32ఏళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురై మరణించాడు. అయితే ఆయన చనిపోయిన 46ఏళ్ల తర్వాత ఇప్పుడు బ్రూస్లీ రాసిన కథను బుల్లితెర పైకి తీసుకొచ్చేందుకు ఆయన కూతురు ప్రయత్నిస్తోంది.బ్రూస్లీ నటించడంతో పాటు.. ఒక సినిమాకు స్క్రిప్టు రాశాడు. 'ది సైలెంట్ ఫ్లూట్' పేరుతో సినిమా చేద్దామనుకున్నాడు. కానీ.. ఆయన చనిపోయిన ఐదేళ్ల తర్వాత దాన్ని 'సర్కిల్ ఆఫ్ ఐరన్' పేరుతో మరొకరు తీసి విడుదల చేశారు.బ్రూస్లీ బతికి ఉన్నప్పుడు 'వారియర్' పేరుతో మరో కథను రాశారు. కానీ అది అప్పుడు కార్యరూపం దాల్చకుండానే బ్రూస్లీ మరణించాడు. అయితే చాలా కాలం తర్వాత బ్రూస్లీ కూతురు షాన్నన్ లీకి ఆ కథ దొరికింది. దీంతో తాజాగా ఆ కథను బుల్లితెరపై టీవీ సిరీస్గా మలిచేందుకు ప్రయత్నిస్తోంది.ఈ కథ మొత్తం మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ అయిన ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుందట. దీన్ని బ్రూస్లీ జన్మించిన శాన్ఫ్రాన్సిస్స్కోలోని చైనాటౌన్లో చిత్రీకరిస్తారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







