సెప్టెంబర్ 8న 'ఇంకొక్కడు' గ్రాండ్ రిలీజ్
- September 07, 2016
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇంకొక్కడు`. ఈ చిత్రాన్ని ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సందర్భంగా...చిత్ర నిర్మాత నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ -``విలక్షణ నటనటకు విక్రమ్ పెట్టింది పేరు. ఆయన చిత్రాలకు ఇక్కడ ఉన్న ఆదరణ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనసరం లేదు.ఆయన చిత్రాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఆసక్తి ఎదురుచూస్తుంటారు. తాజాగా అదే కోవలో చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఇంకొక్కడు. అఖిల్, లవ్ అనే రెండు పాత్రల్లో విక్రమ్ అలరించడం ఖాయం. థియేట్రికల్ ట్రైలర్ చూసిన వారందరికీ విక్రమ్ లవ్ గెటప్ బాగా నచ్చింది.ఆనంద్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ను పొందింది. విక్రమ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్లో సినిమా సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది`` అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







