సౌత్ ఇండియాలో ఉన్న అఫీషియల్స్కి ధృవ స్పెషల్ షో ..
- September 07, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తనీ ఒరువన్కి రీమేక్గా ధృవ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఐపీఎస్ పాత్రని పోషించగా.. ఈ రోల్ కోసం పలువురు పోలీస్ ఆఫీర్లని కలిసి వారి నుండి విలువైన సలహాలు తీసుకున్నాడట చెర్రీ. ఈ క్రమంలో తనకు ఇంతగా సాయపడిన పోలీస్ ఆఫీసర్స్ అందరికి, సౌత్ ఇండియాలోని ఇతర జిల్లాలో ఉన్న అఫీషియల్స్కి ధృవ స్పెషల్ షో వేయనున్నట్టు సమాచారం. ధృవ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి డిసెంబర్లో సినిమాను ప్రేక్షకులు ముందుకు తేవాలని యూనిట్ భావిస్తోంది. అసలు ఈ సినిమా దసరాకు వస్తుందని అందరు భావించగా ఈ సినిమాలో నటిస్తున్న అరవింద్స్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్లే వెనక్కి తగ్గిందని అంటున్నారు.కొందరు అక్టోబర్ నెల చెర్రీకి కలిసి రానందునే పోస్ట్ పోన్ చేసారని చెబుతున్నారు. చూడాలి మరి ధృవ అఫీషియల్ డేట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారో.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









