పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని : కేటీఆర్
- September 08, 2016
అంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినట్టే తమ రాష్ట్రానికి కూడా సహకరించాలని కేంద్రాన్ని తాను అడిగినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. అలా కాకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి తెలిపానన్నారు. అరుణ్ జైట్లీతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తాను కోరినట్లు చెప్పిన కేటీఆర్, నీతి ఆయోగ్ సూచన మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24,500 కోట్లు ఇవ్వాలని కోరానన్నారు. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల చొప్పున ఐదేళ్ళ పాటు ఇవ్వాలని కూడా అడిగానన్నారు. ఇంకా హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్- నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని అడిగామన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









