కాళొజీ పురస్కారం గోరటి వెంకన్నకు ప్రదానం

- September 09, 2016 , by Maagulf
కాళొజీ పురస్కారం గోరటి వెంకన్నకు ప్రదానం

హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగాప్రజాకవి గోరటి వెంకన్నకు కాళొజీ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్‌, నాయిని నర్సింహారెడ్డి సాంస్కృతిక మండలి ఛైర్మన్‌ రసమయి బాలకృష్ణ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని కాళొజీ సేవలను కొనియాడారు. సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ... తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళొజీ అని వివరించారు. కాళొజీ పేరటి ఏర్పాటు చేసిన అవార్డును గోరటి వెంకన్నకు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.
'అద్దాల అంగడి అంటూ..' గోరేటి వెంకన్న ఆలపించిన పాట సభికులను ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com