ఘోర రోడ్డు ప్రమాదం : ఒడిశా లో
- September 09, 2016
ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లా, అథమల్లిక్ ప్రాంతంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు బ్రిడ్జి పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో 25 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 16 మంది ఘటనా స్థలంలో చనిపోగా మరో 9 మంది ఆస్పత్రిలో కన్నుమూశారు. మృతుల్లో మహిళలు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వేగంగా వెళుతున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









