మహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాల ప్రకారం 488 మంది ఖైదీలు విడుదల
- September 09, 2016
ఈద్ అల్ అధా సందర్భంగా 488 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఎమిరేట్ లో వివిధ సంస్కారణాత్మక మరియు శిక్షాత్మక సంస్థల్లో కాలం గడుపుతున్న 488 మంది ఖైదీలను దుబాయ్ పాలకుడు, యు ఏ ఇ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు, అతని యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం తన విస్తృత అధికారాలతో విడుదలకు ఆదేశించారు.
దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ ఈసా అల్ హుమైదాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దుబాయ్ పోలీస్ సహకారంతో, షేక్ మహ్మద్ ఆజ్ఞని అమలు చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమైనట్లు చెప్పారు. షేక్ మహ్మద్ చూపిన ఔదార్యం వలన ఈ పండుగ వేళ ఖైదీల కుటుంబాలలో ఎనలేని ఆనందం తీసుకునివస్తుందని ఆశించారు. విడుదల కాబడిన ఖైదీలను తిరిగి తమ కుటుంబాలని కలుసుకొని ఇకపై సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. సమాజంలో మంచి సభ్యులుగా ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ విడుదల దోహదపడి వారు ఒక మంచి నూతన లక్ష్యంతో జీవించాలని అల్ హుమైదాన్ సూచించారు. ఈ విడుదల కేవలం షేక్ మహ్మద్ తన ఉన్నత చొరవ కారణంగా ఇది సాధ్యపడినట్లు అటార్నీ జనరల్ తెలిపాడు మరియు మతసంబంధ మరియు నైతిక విలువలకు కట్టుబడి వారి జీవితాలను ప్రశాంతంగా కొనసాగించాలని ఆయన ఖైదీలను కోరారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







