మహమ్మద్ బిన్ రషీద్ ఆదేశాల ప్రకారం 488 మంది ఖైదీలు విడుదల
- September 09, 2016
ఈద్ అల్ అధా సందర్భంగా 488 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఎమిరేట్ లో వివిధ సంస్కారణాత్మక మరియు శిక్షాత్మక సంస్థల్లో కాలం గడుపుతున్న 488 మంది ఖైదీలను దుబాయ్ పాలకుడు, యు ఏ ఇ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు, అతని యువరాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం తన విస్తృత అధికారాలతో విడుదలకు ఆదేశించారు.
దుబాయ్ అటార్నీ జనరల్ ఇస్సామ్ ఈసా అల్ హుమైదాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే దుబాయ్ పోలీస్ సహకారంతో, షేక్ మహ్మద్ ఆజ్ఞని అమలు చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమైనట్లు చెప్పారు. షేక్ మహ్మద్ చూపిన ఔదార్యం వలన ఈ పండుగ వేళ ఖైదీల కుటుంబాలలో ఎనలేని ఆనందం తీసుకునివస్తుందని ఆశించారు. విడుదల కాబడిన ఖైదీలను తిరిగి తమ కుటుంబాలని కలుసుకొని ఇకపై సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. సమాజంలో మంచి సభ్యులుగా ఒక కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ విడుదల దోహదపడి వారు ఒక మంచి నూతన లక్ష్యంతో జీవించాలని అల్ హుమైదాన్ సూచించారు. ఈ విడుదల కేవలం షేక్ మహ్మద్ తన ఉన్నత చొరవ కారణంగా ఇది సాధ్యపడినట్లు అటార్నీ జనరల్ తెలిపాడు మరియు మతసంబంధ మరియు నైతిక విలువలకు కట్టుబడి వారి జీవితాలను ప్రశాంతంగా కొనసాగించాలని ఆయన ఖైదీలను కోరారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







