ఫిదా రెండో షెడ్యూల్ అమెరికాలో..
- September 09, 2016
వరుణ్తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫిదా' . సాయిపల్లవి కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్రాజు నిర్మిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరుగుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ను పూర్తిచేసుకుని యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన పాత్రలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ విషయాన్ని వరుణ్ ట్వీట్ చేయడంతో పాటు కథానాయిక సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలు కానున్నట్లు, దానిని కథాపరంగా అమెరికాలో చిత్రీకరిస్తారని, అందుకు అనుగుణంగానే చిత్రబృందం అమెరికా ప్రయాణానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. అమెరికా అబ్బాయికి..తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







