బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం : 10 మంది మృతి
- September 09, 2016
బంగ్లాదేశ్లో శనివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గజిపూర్లోని తోంగి ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని బాయిలర్ ప్లాంట్లో పేలుడు సంభవించినట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులకు ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెంపకో ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో తెల్లవారుజామున ఈ పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక సిబ్బంది స్పష్టంచేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి మంటలను అదుపుచేసినట్లు చెప్పారు.పలువురు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







