మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టనున్న శరత్కుమార్..
- September 09, 2016
ఇకనుంచి నటనపై అధికంగా దృష్టి పెట్టనున్నట్లు శరత్కుమార్ పేర్కొన్నారు. కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజీని సొంతం చేసుకున్నారాయన. సమత్వ మక్కల్ కట్చిని స్థాపించి రాజకీయ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో తిరుచెందూర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మళ్లీ సినిమాలపై దృష్టిపెట్టారు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ... ''ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నప్పటికీ నటుడిగా వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నా. వాటిలో మంచి పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నా. జీవితంలో గెలుపోటములు సహజమే. మనిషి జీవితం సైకిల్ పెడల్ వంటిది.ఒకటి పైకి వచ్చేటప్పుడు.. మరొకటి కింద ఉంటుంది. కానీ నేను సైకిల్ నడపడమే ఆపేశాను. అది సరికాదని ప్రస్తుతం అర్థమైంది.అందుకే నటుడిగా కెరీర్పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ప్రస్తుతం జీవీ ప్రకాశ్ నటిస్తున్న 'అడంగాదే'లో ముఖ్యపాత్ర పోషిస్తున్నా. షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడలో పునీత్ రాజ్కుమార్తో కలిసి 'రాజకుమారా'లో నటిస్తున్నా.ఈ చిత్రం త్వరలోనే తెరపైకి రానుంది. మరో రెండు కథలు విన్నా. ఇకపై వరుసగా చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తాన''ని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







