ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పెషల్ ఫేర్స్
- September 10, 2016
లో కాస్ట్ క్యారియర్ ఎయిర్ ఇండియా శ్రీక్స్ప్రెస్, స్పెషల్ ఫేర్స్ని అబుదాబీ, సార్జా నుంచి ఎంపిక చేయబడిన రూట్లలో ప్రకటించింది. సెప్టెంబర్ 14 నుంచి అబుదాబీ - కోజి కోడ్ మధ్య చార్జీలు 365 దిర్హామ్లకు తగ్గుతుంది. ఎయిర్ ఇండియా ట్రావెల్ కన్సల్టెంట్ అబ్దుల్ సలైహ్ ఈ వివరాల్ని వెల్లడించారు. మామూలుగా అయితే కోజికోడ్కి ఒక వైపు చార్జీ 435 దిర్హామ్లు అంతకు మించి ఉంటుంది. ఒక్కోసారి ఈ మొత్తం 1,110 దిర్హామ్ల వరకు వెళుతుంది. సెప్టెంబర్ 14 వరకు తమ విమానాలన్నీ ఫుల్ అయిపోయినట్లుగా ఆయన వివరించారు. షార్జా ఆఫర్ల విషయానికి వస్తే, సెప్టెంబర్ 15 నుంచి నాన్ స్టాప్ విమానాలకు షార్జా నుంచి ఛండీగర్ వెళ్ళేందుకు 210 దిర్హామ్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త రూట్లో ప్రమోషనల్ ఆఫర్గా దీన్ని ప్రకటించినట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 14 నుంచి కోచి కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ షార్జా నుంచి వారణాసి, తిరుచురాపల్లికి రోజువారీ నాన్స్టాప్ విమానాల్ని నడపనుంది.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







