ఢిల్లీలో స్వల్ప భూకంపం
- September 10, 2016
ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దేశరాజధాని ఢిల్లీ, గురుగ్రామ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయినట్లు భారత్ వాతావరణ శాఖ( ఐఎండీ) తెలిపింది.
హర్యానాలోని జగ్గర్ కేంద్రంగా భూగర్భం లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పింది. దాదాపు 30 సెకండ్ల పాటు ఢిల్లీలో భూమి కంపించినట్లు రాజధానివాసులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లలో మూడు వారాల క్రితం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్ లో గత ఏడాది సంభవించిన భారీ భూకంపం తర్వాత నుంచి ఉత్తరాదిలో పలుమార్లు భూమి కంపిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









