ఢిల్లీలో స్వల్ప భూకంపం

- September 10, 2016 , by Maagulf
ఢిల్లీలో స్వల్ప భూకంపం

ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దేశరాజధాని ఢిల్లీ, గురుగ్రామ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయినట్లు భారత్ వాతావరణ శాఖ( ఐఎండీ) తెలిపింది.

హర్యానాలోని జగ్గర్ కేంద్రంగా భూగర్భం లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పింది. దాదాపు 30 సెకండ్ల పాటు ఢిల్లీలో భూమి కంపించినట్లు రాజధానివాసులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లలో మూడు వారాల క్రితం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్ లో గత ఏడాది సంభవించిన భారీ భూకంపం తర్వాత నుంచి ఉత్తరాదిలో పలుమార్లు భూమి కంపిస్తూ వస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com