తప్పిపోయిన ఇండియన్ కుక్ మృతి
- September 11, 2016
దుబాయ్: ఇటీవలే ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన కుక్ మైకేల్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 36 ఏళ్ళ మైకేల్, కేరళ నుంచి సెప్టెంబర్ 3న విజిట్ వీసాపై దుబాయ్కి వచ్చాడు. సెప్టెంబర్ 6న అతను తప్పిపోయినట్లు మృతుడి బంధువు సిజో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిజో పనిచేస్తున్న అల్ కోజ్ మాల్లోని ఓ క్యాటరింగ్ కంపెనీలో కుక్గా పనిచేస్తున్నాడు మైకేల్. అయితే రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత, అకామడేషన్కి వెళ్ళే క్రమంలో కంపెనీ వ్యాన్ని మిస్ అయిన మైకేల్, కాలి నడకన వెళ్ళడంతో, దారి తెలియక తప్పిపోయాడు. పాస్పోర్ట్, వీసా తను పనిచేస్తున్న చోట మర్చిపోయాడని సిజో పోలీసులకు తెలిపాడు. మార్చురీలో మైకేల్ మృతదేహం ఉందని, పోలీసులు విచారణ తర్వాతే మైకేల్ మృతి వివరాలు వెల్లడిస్తామన్నారనీ, ఈద్ అల్ అదా సెలవుల అనంతరం ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని పోలీసులు తెలిపినట్లు చెప్పాడు సిజో.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









