తప్పిపోయిన ఇండియన్ కుక్ మృతి
- September 11, 2016
దుబాయ్: ఇటీవలే ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన కుక్ మైకేల్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 36 ఏళ్ళ మైకేల్, కేరళ నుంచి సెప్టెంబర్ 3న విజిట్ వీసాపై దుబాయ్కి వచ్చాడు. సెప్టెంబర్ 6న అతను తప్పిపోయినట్లు మృతుడి బంధువు సిజో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిజో పనిచేస్తున్న అల్ కోజ్ మాల్లోని ఓ క్యాటరింగ్ కంపెనీలో కుక్గా పనిచేస్తున్నాడు మైకేల్. అయితే రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత, అకామడేషన్కి వెళ్ళే క్రమంలో కంపెనీ వ్యాన్ని మిస్ అయిన మైకేల్, కాలి నడకన వెళ్ళడంతో, దారి తెలియక తప్పిపోయాడు. పాస్పోర్ట్, వీసా తను పనిచేస్తున్న చోట మర్చిపోయాడని సిజో పోలీసులకు తెలిపాడు. మార్చురీలో మైకేల్ మృతదేహం ఉందని, పోలీసులు విచారణ తర్వాతే మైకేల్ మృతి వివరాలు వెల్లడిస్తామన్నారనీ, ఈద్ అల్ అదా సెలవుల అనంతరం ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని పోలీసులు తెలిపినట్లు చెప్పాడు సిజో.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







