తప్పిపోయిన ఇండియన్ కుక్ మృతి
- September 11, 2016దుబాయ్: ఇటీవలే ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన కుక్ మైకేల్, అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 36 ఏళ్ళ మైకేల్, కేరళ నుంచి సెప్టెంబర్ 3న విజిట్ వీసాపై దుబాయ్కి వచ్చాడు. సెప్టెంబర్ 6న అతను తప్పిపోయినట్లు మృతుడి బంధువు సిజో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిజో పనిచేస్తున్న అల్ కోజ్ మాల్లోని ఓ క్యాటరింగ్ కంపెనీలో కుక్గా పనిచేస్తున్నాడు మైకేల్. అయితే రాత్రి డ్యూటీ ముగిసిన తర్వాత, అకామడేషన్కి వెళ్ళే క్రమంలో కంపెనీ వ్యాన్ని మిస్ అయిన మైకేల్, కాలి నడకన వెళ్ళడంతో, దారి తెలియక తప్పిపోయాడు. పాస్పోర్ట్, వీసా తను పనిచేస్తున్న చోట మర్చిపోయాడని సిజో పోలీసులకు తెలిపాడు. మార్చురీలో మైకేల్ మృతదేహం ఉందని, పోలీసులు విచారణ తర్వాతే మైకేల్ మృతి వివరాలు వెల్లడిస్తామన్నారనీ, ఈద్ అల్ అదా సెలవుల అనంతరం ఫోరెన్సిక్ నివేదిక వస్తుందని పోలీసులు తెలిపినట్లు చెప్పాడు సిజో.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం