చేతిరాత పాస్పోర్టుల్ని మార్చుకోండి: ఇండియన్స్కి సూచన
- September 11, 2016
అబుదాబీ: యూఏఈలో భారతీయ వలసదారులు ఎవరైతే ఇంకా చేతి రాత కలిగిన పాస్పోర్టుల్ని వినియోగిస్తున్నారో తక్షణం వాటిని మెషీన్ రీడ్ పాస్పోర్టులతో రీప్లేస్ చేసుకోవాల్సిందిగా అబుదాబీలోని ఇండియన్ ఎంబసీ సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎఫైర్స్ (ఇండియా) సూచన మేరకు ఈ ప్రకటన చేసింది ఎంబసీ. 2015, నవంబర్ 25వ తేదీని గతంలో డెడ్లైన్గా ప్రకటించినా ఇంకా అంతర్జాతీయంగా 200,000 పాస్పోర్టులు ఇంకా చేతిరాతతోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. మెషీన్ రీడింగ్ పాస్పోర్టులతో ప్రయాణాలు ఇంకా సులభతరం అవుతాయని అధికారులు వెల్లడించారు. ఇండియన్ ఎంబసీ వెబ్సైట్తోపాటు, మరో వెబ్సైట్లోనూ సంప్రదించి, మెషీన్ రీడింగ్ పాస్పోర్టులను పొందవచ్చు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







