బొప్పాయి పాయసం
- September 12, 2016
కావలసినవి: ముగ్గిన బొప్పాయిలు 2 కేజీలు, చక్కెర అరకేజీ, నీరు ఒకటిన్నర కప్పు, కొబ్బరికాయలు రెండు, యాలకులు 5, జీడిపపలు 15, కిస్మిస్ 10, నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు.
ఎలా చేయాలి
బొప్పాయి పళ్లను చెక్కు తీసి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోయాలి. ఒక బాణలిలో వాటిని వేసి కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని తురిమి మూడు విడతలుగా పాలు తయారు చేయాలి. తురుము నుంచి మొదట ఒక కప్పు పాలు తీయాలి. ఆ పిప్పి నుంచి మళ్లీ మూడు కపలు పాలు తీయాలి. మరో సారి కూడా ఆ పిప్పి నుంచి మూడు కప్పుల పాలు తీయాలి. ఈ పాలను విడి విడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో నీళ్లు పోసి వేడి చేయాలి. లేత పాకం వచ్చాక బొప్పాయి పళ్ల గుజ్జును, చివర్లో తీసిన మూడు కపల కొబ్బరి పాలను వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత రెండో సారి తీసిన కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి. కొద్ది నిమిషాల తర్వాత మొదట తీసిన ఒక కప్పు కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి. యాలకులను పొడి చేసి చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి కిందికి దించాలి. నేతిలో వేగించిన జీడిపపలు, కిస్మిస్లతో అలంకరించాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









