బొప్పాయి పాయసం
- September 12, 2016
కావలసినవి: ముగ్గిన బొప్పాయిలు 2 కేజీలు, చక్కెర అరకేజీ, నీరు ఒకటిన్నర కప్పు, కొబ్బరికాయలు రెండు, యాలకులు 5, జీడిపపలు 15, కిస్మిస్ 10, నెయ్యి మూడు టేబుల్ స్పూన్లు.
ఎలా చేయాలి
బొప్పాయి పళ్లను చెక్కు తీసి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కోయాలి. ఒక బాణలిలో వాటిని వేసి కొద్దిగా నీళ్లు పోసి వేడి చేయాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీనికి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిని తురిమి మూడు విడతలుగా పాలు తయారు చేయాలి. తురుము నుంచి మొదట ఒక కప్పు పాలు తీయాలి. ఆ పిప్పి నుంచి మళ్లీ మూడు కపలు పాలు తీయాలి. మరో సారి కూడా ఆ పిప్పి నుంచి మూడు కప్పుల పాలు తీయాలి. ఈ పాలను విడి విడిగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత చక్కెరలో నీళ్లు పోసి వేడి చేయాలి. లేత పాకం వచ్చాక బొప్పాయి పళ్ల గుజ్జును, చివర్లో తీసిన మూడు కపల కొబ్బరి పాలను వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడిన తర్వాత రెండో సారి తీసిన కొబ్బరి పాలను వేసి బాగా కలపాలి. కొద్ది నిమిషాల తర్వాత మొదట తీసిన ఒక కప్పు కొబ్బరి పాలు పోసి బాగా కలపాలి. యాలకులను పొడి చేసి చల్లాలి. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి కలిపి కిందికి దించాలి. నేతిలో వేగించిన జీడిపపలు, కిస్మిస్లతో అలంకరించాలి.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







