ఈద్ ఉత్సవాల వేళ చిన్న నిరాశ
- September 12, 2016
అబుదబీ: యూఏఈలోని పలు కుటుంబాల్లో ఈద్ అల్ అదా సందర్భంగా చిన్న నిరాశ కనిపిస్తోంది. ఆయా కుటుంబాల్లోని కొందరు హజ్ యాత్రలో ఉండటంతో సంప్రదాయంగా ఉన్న కొన్ని సెంటిమెంట్లను పాటించలేకపోతున్నామని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే హజ్ యాత్ర ఎంతో పవిత్రమైనదని వారు చెబుతున్నారు. 'నా భర్త ఓ మంచి కార్యం కోసం మాకు దూరమయ్యారన్న విషయాన్ని మేం అర్థం చేసుకోగలం. ఈద్ శుభ వేళ కుటుంబ పెద్ద లేకపోవడం కొంచెం బాధ కలిగిస్తోంది' అని భారతదేశానికి చెందిన 30 ఏళ్ళ షబ్నమ్ మొయిదీన్ చెప్పారు. ప్రతి సంవత్సరం ఈద్ అల్ అదా సెలబ్రేషన్స్, వార్షిక హజ్ యాత్రతో లింక్ చేయబడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా హజ్ యాత్రీకులు సౌదీ అరేబియాలోని మక్కాకి చేరుకుని పవిత్ర ప్రార్థనలు నిర్వహిస్తారు. యూఏఈలోని వలసదారులైన హజ్ యాత్రీకులు కుటుంబాలతో కలిసి హజ్ యాత్రకు వెళుతుంటారు. కుటుంబాన్ని వదిలి కుటుంబ పెద్దలు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు మాత్రం, తమవారి క్షేమం కోసం ఈద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







