'ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్' పై మంత్రి శ్రీనివాస్ యాదవ్ సమీక్ష
- September 13, 2016
ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్పై సినీ నిర్మాతలు, సినీ ప్రముఖులతో హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్సిటీ ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ఈనెల 24 నుంచి 27వరకు ఇండీవుడ్ కార్నివాల్ ఇక్కడ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలో పలు చిత్ర పరిశ్రమలు వస్తున్నందున పరస్పర సహకారానికి కార్నివాల్ ఉపయోగపడుతుందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కళాఖండం రామోజీ ఫిల్మ్సిటీ అని పేర్కొన్నారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు, రవాణా సదుపాయాలు బాగున్నాయని వివరించారు. ఇండీవుడ్ కార్నివాల్ను విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందుకు సినీ ప్రముఖులు కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ని ‘మా’ కార్యవర్గ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యుడు శివాజీ, సినీ నిర్మాత సి.కల్యాణ్, పలువురు సినీప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







