భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని..
- September 13, 2016
కశ్మీర్ ఆందోళనల నేపథ్యంలో భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి అదే ధోరణి బయటపెట్టారు. భారత్ నుంచి విడిపోయేందుకు కశ్మీర్ ప్రజలు చేస్తున్న త్యాగాలకు ఈ బక్రీద్ పండగను అంకితం చేస్తున్నానంటూ షరీఫ్ వ్యాఖ్యానించారు.బక్రీద్ పర్వదినం సందర్భంగా రాయ్విండ్లోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి షరీఫ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 'కశ్మీరీ ప్రజల త్యాగాలను మేం మర్చిపోం. వారి త్యాగాలకు బక్రీద్ పండగను అంకితమిస్తున్నాం.వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. కశ్మీర్ ప్రజలఆశలు నెరవేరేదాకా మేం వారికి మద్దతిస్తూనే ఉంటాం' అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత్ నుంచి స్వేచ్ఛ పొందేందుకు కశ్మీర్ ప్రజలు వారి మూడో తరాన్ని త్యాగం చేశారని షరీఫ్ అన్నారు.హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భారత బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బుర్హాన్ వనీని స్వాంత్రంత్య సమరయోధుడిగా పాక్ పేర్కొంది. దీంతో భారత్, పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







