భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని..
- September 13, 2016కశ్మీర్ ఆందోళనల నేపథ్యంలో భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి అదే ధోరణి బయటపెట్టారు. భారత్ నుంచి విడిపోయేందుకు కశ్మీర్ ప్రజలు చేస్తున్న త్యాగాలకు ఈ బక్రీద్ పండగను అంకితం చేస్తున్నానంటూ షరీఫ్ వ్యాఖ్యానించారు.బక్రీద్ పర్వదినం సందర్భంగా రాయ్విండ్లోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి షరీఫ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 'కశ్మీరీ ప్రజల త్యాగాలను మేం మర్చిపోం. వారి త్యాగాలకు బక్రీద్ పండగను అంకితమిస్తున్నాం.వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. కశ్మీర్ ప్రజలఆశలు నెరవేరేదాకా మేం వారికి మద్దతిస్తూనే ఉంటాం' అని షరీఫ్ తన సందేశంలో పేర్కొన్నారు. భారత్ నుంచి స్వేచ్ఛ పొందేందుకు కశ్మీర్ ప్రజలు వారి మూడో తరాన్ని త్యాగం చేశారని షరీఫ్ అన్నారు.హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భారత బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో పాక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బుర్హాన్ వనీని స్వాంత్రంత్య సమరయోధుడిగా పాక్ పేర్కొంది. దీంతో భారత్, పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు