రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నఎయిర్‌ఏషియా..

- September 13, 2016 , by Maagulf
రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నఎయిర్‌ఏషియా..

కావేరీ వివాదంతో కర్ణాటక అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విమానాల్లో వెళ్లాల్సినవారు ఎయిర్‌పోర్టుకు చేరుకోలేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌ఏషియా తమ ప్రయాణికులకు కాస్త వూరట కలిగించింది. ఆందోళనల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఉచితంగా రీషెడ్యూల్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.బెంగళూరు నుంచి ఎయిర్‌ఏషియా విమానాల్లో మంగళవారం వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను ఉచితంగా రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని ఎయిర్‌లైన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఆందోళనల దృష్ట్యా ఎయిర్‌పోర్టుకు రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మంగళవారానికి టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు 72 గంటల్లోగా ఎప్పుడైనా వెళ్లొచ్చని ఎయిర్‌ఏషియా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com