తమిళనాడు, కర్ణాటక ప్రజలు ఆందోళనలకు దిగడం మంచిది కాదని: ప్రధాని
- September 13, 2016
కావేరి జలాల వివాదంపై కర్ణాటక రాజధాని బెంగళూరులో నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సమస్యలకు ఆందోళనలు పరిష్కారం కాదు.. శాంతంగా వ్యవహరించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యం నెలకొనేలా చేయాలే కానీ.. ఇలా ఆందోళనలకు దిగడం మంచిది కాదని సూచించారు. కావేరి జలాలను తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయాలని సుప్రీంకోర్టు మరోమారు ఆదేశించడంతో కర్ణాటకలో ఆందోళనలు చెలరేగాయి. వీటి కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి.ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.సోమవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉమేశ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతడి కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







