రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నఎయిర్ఏషియా..
- September 13, 2016
కావేరీ వివాదంతో కర్ణాటక అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పలు సాఫ్ట్వేర్ సంస్థలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విమానాల్లో వెళ్లాల్సినవారు ఎయిర్పోర్టుకు చేరుకోలేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఏషియా తమ ప్రయాణికులకు కాస్త వూరట కలిగించింది. ఆందోళనల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.బెంగళూరు నుంచి ఎయిర్ఏషియా విమానాల్లో మంగళవారం వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చని ఎయిర్లైన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆందోళనల దృష్ట్యా ఎయిర్పోర్టుకు రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మంగళవారానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు 72 గంటల్లోగా ఎప్పుడైనా వెళ్లొచ్చని ఎయిర్ఏషియా తెలిపింది.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







