రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నఎయిర్ఏషియా..
- September 13, 2016
కావేరీ వివాదంతో కర్ణాటక అట్టుడికిపోతోంది. ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పలు సాఫ్ట్వేర్ సంస్థలు, విద్యా సంస్థలు మూతబడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విమానాల్లో వెళ్లాల్సినవారు ఎయిర్పోర్టుకు చేరుకోలేక తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ఏషియా తమ ప్రయాణికులకు కాస్త వూరట కలిగించింది. ఆందోళనల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఉచితంగా రీషెడ్యూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.బెంగళూరు నుంచి ఎయిర్ఏషియా విమానాల్లో మంగళవారం వెళ్లాల్సిన ప్రయాణికులు తమ ప్రయాణాలను ఉచితంగా రీషెడ్యూల్ చేసుకోవచ్చని ఎయిర్లైన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆందోళనల దృష్ట్యా ఎయిర్పోర్టుకు రావడం ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. మంగళవారానికి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు 72 గంటల్లోగా ఎప్పుడైనా వెళ్లొచ్చని ఎయిర్ఏషియా తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







