అరాఫత్ డే సందర్భంగా 50 శాతం పెంచేసిన ట్యాక్సీ సంస్థలు
- September 13, 2016
జెడ్డా: పబ్లిక్ ట్యాక్సీ కంపెనీలు ఈద్ రాత్రికి 50 శాతం ఛార్జీల్ని పెంచేశాయి. కొత్త సంస్థలు, పాత సంస్థలూ అన్నీ ఇదే బాటలో నడిచాయి. జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (జెసిసిఐ) ట్యాక్సీస్ కమిటీ మెంబర్ అబ్దుల్ హాది అల్ కహ్తని మాట్లాడుతూ, కొత్త ట్యాక్సీ కంపెనీలు అనూహ్యంగా మూర్కెట్లోకి వచ్చాయనీ, ఈ కారణంగా సంప్రదాయ ట్యాక్సీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దుబాయ్ మరియు టర్కీల్లోలా 'జెడ్డా ట్యాక్సీ' విధానంలో పనిచేశామనీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తమకు ప్రతిబంధకంగా మారాయని, కాలంతోపాటు మారవలసి వస్తోందని ఆయన తెలిపారు. మరో మెంబర్ మేజర్ జనరల& ఫరూక్ జహ్రాన్ మాట్లాడుతూ పబ్లిక్ ట్యాక్సీలలో దొరికే భద్రత, మిగతా వాటిల్లో దొరకదనీ, ప్రయాణీకులకు అన్ని విధాలా పబ్లిక్ ట్యాక్సీలే అందుబాటులో ఉంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







