అరాఫత్‌ డే సందర్భంగా 50 శాతం పెంచేసిన ట్యాక్సీ సంస్థలు

- September 13, 2016 , by Maagulf
అరాఫత్‌ డే సందర్భంగా 50 శాతం పెంచేసిన ట్యాక్సీ సంస్థలు

జెడ్డా: పబ్లిక్‌ ట్యాక్సీ కంపెనీలు ఈద్‌ రాత్రికి 50 శాతం ఛార్జీల్ని పెంచేశాయి. కొత్త సంస్థలు, పాత సంస్థలూ అన్నీ ఇదే బాటలో నడిచాయి. జెడ్డా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (జెసిసిఐ) ట్యాక్సీస్‌ కమిటీ మెంబర్‌ అబ్దుల్‌ హాది అల్‌ కహ్తని మాట్లాడుతూ, కొత్త ట్యాక్సీ కంపెనీలు అనూహ్యంగా మూర్కెట్‌లోకి వచ్చాయనీ, ఈ కారణంగా సంప్రదాయ ట్యాక్సీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. దుబాయ్‌ మరియు టర్కీల్లోలా 'జెడ్డా ట్యాక్సీ' విధానంలో పనిచేశామనీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తమకు ప్రతిబంధకంగా మారాయని, కాలంతోపాటు మారవలసి వస్తోందని ఆయన తెలిపారు. మరో మెంబర్‌ మేజర్‌ జనరల& ఫరూక్‌ జహ్రాన్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ ట్యాక్సీలలో దొరికే భద్రత, మిగతా వాటిల్లో దొరకదనీ, ప్రయాణీకులకు అన్ని విధాలా పబ్లిక్‌ ట్యాక్సీలే అందుబాటులో ఉంటాయని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com