యెమెన్లో ముగ్గురు కతారీ సైనికుల మృతి
- September 13, 2016
యెమెన్లో షియా రెబల్స్, జిహాదీలతో జరుగుతున్న పోరాటంలో ముగ్గురు ఖతారీ సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద లాస్ అని అధికారులు పేర్కొన్నారు. గత నవంబర్లో ఖతార్ సైనికుడొకరు యెమెన్లో శాంతి కోసం సంకీర్ణ దళాలు జరిపిన పోరాటంలో మృతి చెందారు. ఇప్పుడు ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారు. గత ఏడాది సెప్టెంబర్లో ఖతార్, భద్రతా బలగాల్ని యెమెన్లో మోహరించింది. యుఎన్ వర్గాల లెక్కల ప్రకారం 6,500 మంది యెమెన్లో మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది పౌరులే ఉన్నారు. యెమెన్లో శాంతి కోసం యూఎన్ ప్రతినిధి బృందం, అలాగే గల్ఫ్ రీజియన్కి చెందిన కూటమికి ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







