యెమెన్‌లో ముగ్గురు కతారీ సైనికుల మృతి

- September 13, 2016 , by Maagulf
యెమెన్‌లో ముగ్గురు కతారీ సైనికుల మృతి

యెమెన్‌లో షియా రెబల్స్‌, జిహాదీలతో జరుగుతున్న పోరాటంలో ముగ్గురు ఖతారీ సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలి కాలంలో ఇది అతి పెద్ద లాస్‌ అని అధికారులు పేర్కొన్నారు. గత నవంబర్‌లో ఖతార్‌ సైనికుడొకరు యెమెన్‌లో శాంతి కోసం సంకీర్ణ దళాలు జరిపిన పోరాటంలో మృతి చెందారు. ఇప్పుడు ముగ్గురు సైనికులు అమరవీరులయ్యారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖతార్‌, భద్రతా బలగాల్ని యెమెన్‌లో మోహరించింది. యుఎన్‌ వర్గాల లెక్కల ప్రకారం 6,500 మంది యెమెన్‌లో మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది పౌరులే ఉన్నారు. యెమెన్‌లో శాంతి కోసం యూఎన్‌ ప్రతినిధి బృందం, అలాగే గల్ఫ్‌ రీజియన్‌కి చెందిన కూటమికి ప్రయత్నిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com