ప్రధానితో ముగిసిన గవర్నర్ సమావేశం

- September 13, 2016 , by Maagulf
ప్రధానితో ముగిసిన గవర్నర్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది. రెండు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి గవర్నర్ వివరించారు. ప్రధానంగా విభజన సమస్యలకు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు సమాచారం. హైకోర్టు విభజన అంశంతో పాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ళలోని సంస్థల విభజనపై చర్చించేందుకు ఈ నెల 14న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జరుగనున్న సమావేశం గురించి ప్రధాని, గవర్నర్ మాట్లాడుకున్నట్లు తెలిసింది. కరవు, వర్షాల పరిస్థితి, ఏపీకి స్పెషల్ ప్యాకేజీ, కృష్ణానదిపై ప్రాజెక్ట్ నిర్మాణాలకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై ప్రధాని, గవర్నర్ చర్చించినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com