సౌదీ జైల్లో 13 ఏళ్ళ శిక్ష అనంతరం ఇంటికి
- September 15, 2016
బహ్రెయిన్కి చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో 13 ఏళ్ళ జైలు జీవితం అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నాడు. తీవ్రవాద నేరారోపణల నేపథ్యంలో అబ్దుల్రహీమ్ అల్ ముర్బతి 2003, జూన్ 16న జైలుకు వెళ్ళాడు. గురువారం ఆయన బహ్రెయిన్కి చేరుకున్నట్లు స్థానిక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ వెల్లడించారు. బహ్రెయిన్ హ్యూమన్ రైట్స్ వాచ్ సొసైటీ జనరల్ సెక్రెటరీ ఫైసల్ ఫులాద్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే సౌదీ అరేబియా, అల్ ముర్బతిని పూర్తిగా విడిచిపెట్టిందా? లేదంటే బహ్రెయిన్కి అప్పగించిందా? అనేదానిపై స్పష్టత లేదు. సౌదీ విధించిన శిక్ష ప్రకారం ఇంకో 15 ఏళ్ళ జైల్ టెర్మ్ ఆయనకు మిగిలే ఉంది. అయితే అల్ మర్బతి కుటుంబ సభ్యులు, ఎలాంటి ఆధారాలు లేకుండా అతన్ని సౌదీ ప్రభుత్వం జైల్లో ఉంచిందని ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







