త్వరలో పోర్టు భూసమీకరణకు నోటిఫికేషన్
- September 15, 2016
బందరు పోర్టు భూసమీకరణకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో ఎంఏడీఏ అధికారులతో గురువారం సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ బందరు పోర్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. పోర్టుతో పాటు పారిశ్రామిక కారిడార్ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. భూసమీకరణ ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు. భూ యజమానులతో పాటు రైతు కూలీలకు కూడా పింఛన్లు అందిస్తామని మంత్రి వివరించారు. అధికారులు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో బందరు ఆర్డీవో సాయిబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), మునిసిపల్ వైస్చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, డెప్యూటీ కలెక్టర్లు సుజాత, సమజ, పద్మావతి, నరేంద్రప్రసాద్, బందరు తహసీల్దార్ బి.నారదముని పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









