వేరుసెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు....
- September 15, 2016
వేరుసెనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వారంలో నాలుగు సార్లు వీటిని తింటే గుండెజబ్బులు చాలా మటుకూ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే వారానికి రెండు సార్లైనా పల్లీలు తినేవారు బరువు పెరిగే అవకాశం తక్కువని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.వేరుసెనగల్లోని రాగి చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది. తద్వారా గుండె సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. వీటిల్లో మోనోశాచురేటెడ్ కొవ్వులూ, యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి.రోజూ కనీసం 15 గ్రాముల వేరుసెనగలు లేదా నట్స్ తీసుకునే వారిలో ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. వేరుసెనగలు, ఇతర గింజలు(బాదం, జీడి, ఆక్రోట్లు మొదలైనవి), వేరుసెనగ పేస్టును తీసుకునే మధ్య వయస్కులపై జరిపిన పరిశోధనలో వేరుసెనగలు, ఇతర గింజలు తిన్నవారిలో శ్వాస సంబంధిత, గుండె జబ్బులు, నాడీ క్షీణత, డయాబెటిస్, క్యాన్సర్ తదితర వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య తక్కువగా ఉందని తేల్చారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









