'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో చిరు
- September 16, 2016
బుల్లితెరపై రెండు సెషన్స్లో ఓ రేంజ్లో హంగామా చేసింది నాగార్జున హోస్ట్గా వచ్చిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం. రెండు సెషన్స్లో అదేజోరు.. టీఆర్పీ రేటింగ్లోనూ ఎదురులేకుండా పోయింది. మూడోసారి మాత్రం ఆడియన్స్ నుంచి అనుకున్న స్పందన రాకపోవడంతో ఆ ఛానెల్ కొత్త ప్రయోగం మొదలుపెట్టినట్టు సమాచారం. ఈసారి నాగ్ స్థానంలో హోస్ట్గా చిరంజీవిని తీసుకోవాలని భావించడం, ఈ విషయమై ఆయనతో మాట్లాడడం ఓకే చేయడం జరిగిపోయింది.మాటీవీలో డిసెంబర్ 12 నుంచి సోమవారం నుంచి గురువారం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ప్రసారం కానుందని సమాచారం. ఎట్ ప్రజెంట్ 150వ మూవీతో బిజీగావున్న మెగాస్టార్, చిత్రీకరణ 50శాతం పూర్తి అయ్యిందని, నవంబర్ చివరినాటికి షూటింగ్ ఫినిష్ చేయాలన్నది ఆయన ఆలోచన.ఆ తర్వాత 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో బిజీ కానున్నాడట. ఇదిలావుండగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులకు చిరు దూరమయ్యాడన్న ప్రచారం వుంది. ఈ కార్యక్రమం ద్వారా మళ్లీ దగ్గరకావచ్చునన్నది మెగా ఫ్యాన్స్లోని ఓ వర్గం భావిస్తోంది. ఒకప్పుడు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి గెస్ట్గా చిరంజీవి హాజరైన విషయం తెల్సిందే!
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







