ఈద్ సెలవు విషాదం నింపింది... ఒమన్ లో రోడ్డు ప్రమాదం

- September 16, 2016 , by Maagulf
ఈద్ సెలవు విషాదం నింపింది... ఒమన్ లో రోడ్డు  ప్రమాదం

మస్క్యాట్: ఈద్ సెలవుల విహార యాత్ర వారి జీవితాల్లో విషాదం నింపింది...దేశం కానీ దేశంకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు...ఒక ఓమానీయుడు మరియు ఇద్దరు  భారత జాతీయులకు రోడ్డు ప్రమాదంలో లో సీక్ , అల్ కామిల్ మరియు బిడియ మధ్య, మంగళవారం సాయంత్రం మరణించాడు. జలాన్ లో  సేకరించిన వివరాల ప్రకారం భారత జాతీయుల షణ్ముగం పరమశివం (49) మరియు కె.ఎస్.వి. చలపతి రావు (48) గా  గుర్తించబడ్డారు. వీరంతా ఒక ఆనందం యాత్రలో ఉండగా మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని  వారంతా చనిపోయినట్లు తెలిపింది. కారుని  డ్రైవింగ్ చేసిన వ్యక్తి  ఒక బంగ్లాదేశీ జాతీయుడని ప్రస్తుతం చావుబతుకుల మధ్య  పోరాడుతూ ఉన్నాడని అతని  స్నేహితులు పేర్కొన్నారు. తన మరణం ముందే తెలిసినట్లుగా ...సోమవారం  సాయంత్రం 5 గంటల సమయంలో చలపతి రావు, ఇతర స్నేహితులతో కలసి మహాల ఉద్యోగ ప్రాంతంలో ఒక సెలవు యాత్రకు వెళుతున్నట్లు  పరమశివం తన ఫేస్బుక్ పేజీలో ఒక ఫోటోని  పోస్ట్ చేసాడని, వారిద్దరూ మాకు మంచి మిత్రులు. ఈ ప్రమాదంపై  మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం వారికి ఇలా జరిగిందని ఊహించలేకపోతున్నామని పరమశివం, కె.ఎస్.వి. చలపతి రావు స్నేహితులు వాపోయారు.  చలపతిరావు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి కాగా పరమశివం తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి  ఒమాని బాధితుడి వివరాలు ఇంకా  అందుబాటులో లేవు. నిర్మాణ సంస్థకు చెందిన ఒక పికప్ వాన్ గతంలోనూ ఈ   నాలుగు చక్రాల వాహనం ప్రమాదంకు గురికాబడినట్లు నివేదికలు ఉండగా, మరోమారు యాక్సిడెంట్ కు గురై ముగ్గురు ప్రాణాలని బలి కొంది. గణాంకాలు మరియు ఇన్ఫర్మేషన్ నేషనల్ సెంటర్ (NCSI) విడుదల చేసిన ఇటీవలి గణాంకాల ప్రకారం, ఒమన్ లో జూలై నెల నుంచి సగటున రోజుకు రెండు మరణాలు  రోడ్డు ప్రమాదాల్లో జరుగుతున్నట్లు పేర్కొంది. 330 ట్రాఫిక్ ప్రమాదాలకు పైగా ఇప్పటివరకు ఆ ప్రాంతంలో జరిగేయని  అందులో  65 మంది చనిపోగా 234 మందికి  గాయాల పాలయ్యారని తెలిపింది  మరణించిన 65 మందిలో 35 మంది ఓమానీయులు కాగా 30 మంది ప్రవాసీయులు ఉన్నారని ఆ నివేదిక తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com