మార్కెట్లు, షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై అధికారుల తనిఖీ
- September 16, 2016
కువైట్ సిటీ : వివిధ మార్కెట్లు మరియు షాపింగ్ మాల్స్ లో భద్రతా ప్రమాణాలపై ప్రచారం నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోఈద్ అల్- అధా ఉత్సవాల సమయంలో ఈ తనిఖీ కార్యక్రమం ప్రారంభించింది. యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ పబ్లిక్ సెక్యూరిటీ వ్యవహారాల మేజర్ జనరల్ ఇబ్రహీం అల్ తర్రహ్ నేతృత్వంలో పలువురు అధికారులు ఇందులో పాల్గొన్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ జారీ చేసిన పత్రికా ప్రకటనలో, ప్రజా సంబంధాలు మరియు సెక్యూరిటీ మీడియా శాఖ సాయంత్రం 5 గంటలకు ప్రారంభించినట్లు ప్రచారంలో వివరించారు. తమ తనిఖీలు మార్కెట్లు , షాపింగ్ మాల్స్ మరియు వినోద మందిరాలలో శాంతిభద్రతలకి తగిన భరోసా ఉండేలా చూడటమే తమ లక్ష్యం అని తెలిపారు. రాజధానితో సహా గవర్నరేట్ల పరిధిలో హవల్లి మరియు ఫర్వాణీయలలో 360 దుకాణాలలో అవెన్యూస్ మాల్ మరియు సౌక్ షారుఖ్ ప్రధాన ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించింది. అందరూ పండుగ ఉత్సాహంలో లో ఉన్నారని అయితే, ఆయా ప్రాంతాలలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా సంరక్షించుకోవాలని అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







