పాఠశాల భవనాల నిర్వహణ భద్రత పునరుద్ధరించడానికి ఏర్పాట్లు

- September 16, 2016 , by Maagulf
పాఠశాల భవనాల నిర్వహణ భద్రత పునరుద్ధరించడానికి ఏర్పాట్లు

మనామా: కొత్త విద్యా సంవత్సరం ( 2016-2017 ) నిర్వహణ పనుల ఖర్చు కోసం  328,600 బి.డి లను కేటాయిస్తున్నట్లు వర్క్స్ పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక  మంత్రిత్వ శాఖ బిల్డింగ్ నిర్వహణ డైరెక్టర్,  హుడా మీర్జా తెలిపారు.  విద్యా మంత్రిత్వశాఖ సహకారంతో  మంత్రిత్వ శాఖ ఇటీవల రాజ్యములో వివిధ దశల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అనేక నిర్వహణ పనులు  పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.పాఠశాల భవనాలు నిర్మాణంలో  భద్రతని పెంపొందించడానికి  నిర్వహణ పనుల మరింత సమర్ధవంతంగా  నిర్వహించడానికి, పాఠశాల భవనాల సమీపంలో అంతర్గత పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఆ నిర్మాణాల ఆయుష్షు పొడిగించేందుకు ఒక  సమగ్ర కార్యాచరణ రూపందించనుంది. ఆర్థిక స్థాయిల్లో వాటి విలువ, యోగ్యత పెంచడానికి ఆయా భవనాల స్థిరత్వం నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ లక్ష్యంతో ఉన్నట్లు మీర్జా పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, ముఖ్యంగా పాఠశాలలు, నిర్వహణ అధిక నాణ్యత సేవల సదుపాయం జరిగేలా పాఠశాల భవనాలు నిలబెట్టడానికి ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ  వార్షిక ప్రణాళిక ప్రకారం  రాజ్యంలోని  పాఠశాలలు నడిపేందుకు లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. ఈ  పాఠశాలలని నిర్వహణ నిమ్మిత్తం ఎంపిక చేశారు. అవి అల్ నూర్ బాలికల సెకండరీ స్కూల్, బాలికల యరొబా  ప్రైమరీ స్కూల్, బాలికల జా ప్రైమరీ స్కూల్, బాలికల సిత్ర  ప్రైమరీ స్కూల్ మరియు బాలికల సోమయ్య   ప్రైమరీ స్కూళ్లు  ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com