భారత్‌-నేపాల్‌ మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న మోదీ

- September 16, 2016 , by Maagulf
భారత్‌-నేపాల్‌ మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న మోదీ

భారత్‌, నేపాల్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నేపాల్‌ ప్రధాని ప్రచండతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేపాల్‌ అభివృద్ధి, ఆర్థికవృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇరుదేశాల బంధాలు బలోపేతం కావడం చరిత్రాత్మక అంశం అని పేర్కొన్నారు. రక్షణ, భద్రత రంగాల అంశంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందన్నారు. నేపాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ప్రచండ బలోపేతం చేశారని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com