హైదరాబాద్ నుంచి అలంపూర్‌ వరకు హరితహారం కార్యక్రమం ..

- September 17, 2016 , by Maagulf
హైదరాబాద్ నుంచి అలంపూర్‌ వరకు హరితహారం కార్యక్రమం ..

 సీఎం కేసీఆర్‌ హరితహారం కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించారు. బెంగళూరు హైవే పక్కన హరితహారం కార్యక్రమాన్ని రేపు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి అలంపూర్‌ వరకు కొనసాగిస్తామని, 180 కి.మీల మేర మొక్కలు నాటనున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ సమీక్షా కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, జూపల్లి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు జోగు రామన్న, లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండలం జహంగీర్‌ పీర్‌ దర్గా దగ్గర రేపు ప్రారంభించనున్నారు. అడ్డాకుల, ఇటిక్యాల మం. ఎర్రవల్లి చౌరస్తాలో మంత్రులు జోగు రామన్న, జూపల్లి ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుందని సమాచారం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com