వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య..
- September 19, 2016
అవకాశాలు అందిపుచ్చుకొని పరిశ్రమలకు సీఎం భూములిస్తున్నారని, 2018 నాటికి బెల్ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నిమ్మలూరులో బెల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్లో 1200మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. నాయకుల కన్నా... ప్రజలే తెలివైనవారని కొనియాడారు.వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య పరిశ్రమలు, సంస్థలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అధికమవుతాయని చెప్పారు. రూ.6వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు జనం కోసం కష్టపడుతున్నారని, కష్టపడే వ్యక్తులకు ప్రజలు సహకారం అందించాలని వెంకయ్య కోరారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







