వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య..

- September 19, 2016 , by Maagulf
వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య..

అవకాశాలు అందిపుచ్చుకొని పరిశ్రమలకు సీఎం భూములిస్తున్నారని, 2018 నాటికి బెల్‌ పరిశ్రమ నిర్మాణం పూర్తవుతుందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం నిమ్మలూరులో బెల్ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెల్‌లో 1200మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. నాయకుల కన్నా... ప్రజలే తెలివైనవారని కొనియాడారు.వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లు అన్న వెంకయ్య పరిశ్రమలు, సంస్థలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అధికమవుతాయని చెప్పారు. రూ.6వేల కోట్లతో ఏపీలో రక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు జనం కోసం కష్టపడుతున్నారని, కష్టపడే వ్యక్తులకు ప్రజలు సహకారం అందించాలని వెంకయ్య కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com