తళుకు తారల అంబరం,నింగినంటే సంబరం:దుబాయ్ 'సైమా అవార్డుల' కార్యక్రమం

- August 08, 2015 , by Maagulf
తళుకు తారల అంబరం,నింగినంటే సంబరం:దుబాయ్ 'సైమా అవార్డుల' కార్యక్రమం

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వారు ఈ సంవత్సరం దుబాయిలో  నిర్వహించిన అవార్డుల ఉత్సవం ఆకాశంలో నక్షత్రాలనే చిన్నబోయేట్టు చేసింది. దీనిలో 2014 సంవత్సరానికిగాను గురువారం తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన వారికి అవార్డులు అందించారు.శుక్రవారం తమిళ,మలయాళం  సినీ పరిశ్రమలకు చెందిన ఆర్టిస్టులకు ఆయా రంగాలలో అవార్డులు అందించారు. ప్రముఖ తెలుగు  నిర్మాత రమానాయుడు జ్ఞాపకార్ధం అల్లు ఆరవింద్, భారతీరాజా, సుహాసిని చేతుల మీదుగా, ఆయన కుటుంబ సభ్యులు వెంకటేష్, రాణా, నగఛైతన్యలు జ్ఞాపికను స్వీకరించారు. ప్రముఖ పాప్  గాయని ఉష ఉత్తుప్ గానం, బాలకృష్ణ, వెంకటేష్, ఖుష్బూ, శ్రుతి హసన్ ల చిందులు వీక్షకులను హుషారెత్తించాయి. బాలకృష్ణ, రాశీ ఖన్నా, చంద్రబోస్, పీటర్ హెఇన్స్, శ్రియ, సుహాసిని, బ్రహ్మానందం, శ్రుతి హసన్ పురస్కారాలందుకున్న వారిలో ప్రముఖులు. భారతీయ సినీ అందాల రాణులు - ప్రణీత, పూజా హెగ్డే, అదా శర్మ, శ్రియ, అమల పాల్ తమ నృత్యాలతో  రంగస్థలాన్ని జిగెల్మనిపించారు.

 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com