పాకిస్తాన్ ఒక ఉగ్రదేశం - బ్రహమదగ్ బుగ్తీ
- September 20, 2016
పాకిస్తాన్ను 'ఉగ్రదేశం'గా చివరకు అదే దేశంలోని బలూచిస్తాన్ ముద్ర వేసేసింది. తమ రాష్ట్రంలో దాదాపు 15 వేలకు పైగా కార్యకర్తలను అరెస్టు చేసినట్టు సైన్యం చెబుతోందని, కనీసం ఒక్క కేసు కూడా కోర్టుకు వెళ్లలేదని ఐక్యరాజ్యసమతి మానవ హక్కుల కమిషన్ లో బలూచిస్తాన్లోని రిపబ్లికన్ పార్టీ నేత బ్రహమదగ్ బుగ్తీ ఫిర్యాదు చేశారు. మానవ హక్కులను ఒకపక్క పాకిస్తాన్ తన దేశంలోనే దారుణంగా హరిస్తూ, మరోపక్క భారత్ పైకి ఉగ్ర మూకలను ఎగదోలుతోందని ఆయన విమర్శించారు. బలూచిస్తాన్ కు భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ప్రకటించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, మిగిలిన ప్రజాస్వామ్య దేశాలు కూడా బలూచిస్తాన్ కు మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని బుగ్తీ కోరారు. పాకిస్తాన్ లో బలూచిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ కలిసి ఉండలేదని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









