రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్డీవో బాలాసోర్..
- September 21, 2016
రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్డీవోబాలాసోర్: ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష బుధవారం రెండోరోజునా విజయవంతమైంది. భారత, ఇజ్రాయెల్ సంయుక్తంగా తయారుచేసిన ఈ క్షిపణులు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి. డీఆర్డీవో తొలుత మంగళవారం ఒడిసాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని విజయవంతంగా పరీక్షించింది.రెండోరోజు భిన్నమైన ఎత్తు, దూరాల లక్ష్యంతో పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్, ముప్పును గుర్తించి హెచ్చరించే రాడార్లను కూడా అమర్చారు. దీంతో శత్రుదేశాల వైమానిక, క్షిపణి దాడులను ముందే పసిగట్టి అడ్డుకోవచ్చు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







