రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్‌డీవో బాలాసోర్‌..

- September 21, 2016 , by Maagulf
రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్‌డీవో బాలాసోర్‌..

రెండో రోజు పరీక్షలు జరిపిన డీఆర్‌డీవోబాలాసోర్‌: ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష బుధవారం రెండోరోజునా విజయవంతమైంది. భారత, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా తయారుచేసిన ఈ క్షిపణులు భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి. డీఆర్‌డీవో తొలుత మంగళవారం ఒడిసాలోని చాందీపూర్‌ ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి వీటిని విజయవంతంగా పరీక్షించింది.రెండోరోజు భిన్నమైన ఎత్తు, దూరాల లక్ష్యంతో పరీక్షించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి నిర్దేశిత లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్టు అధికారులు ప్రకటించారు. వీటిలో మల్టీ ఫంక్షనల్‌ సర్వైలెన్స్‌, ముప్పును గుర్తించి హెచ్చరించే రాడార్‌లను కూడా అమర్చారు. దీంతో శత్రుదేశాల వైమానిక, క్షిపణి దాడులను ముందే పసిగట్టి అడ్డుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com