సంగీతాభిమానుల్ని అలరిస్తున్న 'మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ'
- September 22, 2016
జయ నరసింహారావు నేతృత్వంలో గత కొన్నేళ్ళుగా సంగీతాభిమానుల్ని విశేషంగా అలరిస్తోంది మ్యూజిక్ లవర్స్ ఫ్యాక్టరీ (ఎంఎల్ఎఫ్). మొహమ్మద్ రఫీకి మెహ్ఫిల్, కిషోర్ కి ఖజానా పేరుతో అలనాటి మేటి పాటలతో పలు కార్యక్రమాల్ని నిర్వహించిన ఎంఎల్ఎఫ్, ఈ నవంబర్లో మరో మ్యూజిక్ ఈవెంట్ని నిర్వహించనుంది. ఈ నవంబర్లో దుబాయ్లో మ్యూజిక్ లవర్స్ని అలరించేందుకు ఎంఎల్ఎఫ్ సమాయత్తమవుతోంది. ఉత్తరాది సినీ పాటలే కాకుండా, దక్షిణాది సినీ పాటలతోనూ పలు ఈవెంట్స్ని గతంలో ఈ ఎంఎల్ఎఫ్ నిర్వహించింది. సినీ పాటల ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన రాజన్ నాగేంద్రను తొలిసారిగా యూఏఈకి తీసుకువచ్చిన ఘనత ఎంఎల్ఎఫ్కే చెందుతుంది. గోల్డెన్ మెలోడీ క్లాసిక్స్ అనదగ్గ పాటల్ని ఎంపిక చేసుకుని, అవసరమైన సాంకేతికతను ఉపయోగించుకుని, సినీ సంగీతాభిమానుల్ని అలరించడంతో అతి తక్కువ కాలంలోనే ఎంఎల్ఎఫ్ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకోగలిగింది. లెజెండరీ సింగర్ ముఖేష్ని జ్ఞప్తికి తెచ్చేలా సప్నే సప్రిలె సప్నే పేరుతో ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ఈ వేదికపై భారతీయ సినీ సంగీత రంగానికి చెందిన లెజెండ్స్కి గ్రేట్ ట్రిబ్యూట్ ఇస్తున్నట్లు ఎంఎల్ఎఫ్ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







