పాక్‌ ఉగ్రవాదానికి పెట్టుబడిదారి....

- September 24, 2016 , by Maagulf
పాక్‌ ఉగ్రవాదానికి పెట్టుబడిదారి....

ఉగ్రవాదానికి పాక్‌ను పెట్టుబడిదారి దేశంగా ప్రకటించాలని ఇండో-అమెరికన్‌ పౌరులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు ఒబామా సర్కారు స్పందించాలంటే లక్ష సంతకాలు అవసరం. ఈ అంశం పాక్‌ ప్రోత్సాహంతో బలపడిన ఉగ్రవాదం వల్ల ఇబ్బంది పడే దేశాలకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 'వుయ్‌ ది పీపుల్‌' పేరుతో ఒబామా సర్కారు ప్రారంభించిన ఆన్‌లైన్‌ పిటిషన్‌ కార్యక్రమంలో దీనికి ఒక విండో కేటాయిస్తుంది. దీని ద్వారా వారు పిటిషన్‌ గురించి ప్రచారం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ సభ్యుడు, ఉగ్రవాదంపై హౌస్‌ సబ్‌కమిటీ ఛైర్మన్‌ టెడ్‌ పోయ్‌, మరో కాంగ్రెస్‌ సభ్యుడు డానా రోహర్బాచర్‌లు ప్రారంభించారు.ఇప్పటికే ఈ మేరకు సిద్ధమైన ఓ బిల్లు అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com