స్కూల్ ఫీజ్ పెంపు - ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే!
- September 24, 2016
షార్జా: షార్జా ఎమిరేట్లో స్కూల్స్, ఇష్టమొచ్చినట్లుగా ఫీజుల్ని పెంచేయడానికి వీల్లేదని అధికారిక వర్గాలు తెలిపాయి. షార్జా ఎడ్యుకేషనల్ జోన్ (ఎస్ఇజెడ్ - సెజ్) అధికారులు ఈ మేరకు స్పష్టతనిచ్చారు. పీజుల్ని పెంచాలనుకుంటున్న విద్యా సంస్థలు, తమ సంస్థల్లో కల్పించే సౌకర్యాలను పెంచుకోవలసి ఉంటుందనీ, ఆ తర్వాత మినిస్ట్రీ నుంచి అలాగే సెజ్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సెజ్ వర్గాలు తెలిపాయి. అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, అధికారులు ఆ స్కూళ్ళలో పర్యటించి అక్కడ లభించే వసతుల్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత స్కూళ్ళలో ఫీజు పెంపుపై ఓ నిర్ణయానికి వస్తారు. అయితే కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుండడంతో చాలా స్కూళ్ళు ఇష్టమొచ్చినట్లుగా ఫీజుల్ని పెంచేసి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇలాంటి స్కూళ్ళపై దాడులు తప్పవని, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







