ఐఎస్ వ్యతిరేకంగా జోర్డాన్ పోరాడుతోంది...
- September 25, 2016
జోర్డాన్ రాజధాని అమ్మాన్లోని అబిదలీ జిల్లా కోర్టు అవరణలో ఓ రచయిత హత్యకు గురయ్యారు. జోర్డాన్కి చెందిన రచయిత నహేద్ అత్తార్ ఆగస్టు 13న ఫేస్ బుక్లో ఓ కార్టూన్ పోస్టు చేశారు. అది ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ కేసు నమోద చేసి నహేద్ను అరెస్టు చేశారు. కొద్ది రోజులు జైలులో ఉన్న నహేద్ సెప్టెంబరు మొదటి వారంలో బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత ఆయన ఆ కార్టూన్ను ఫేస్ బుక్ నుంచి తొలగించారు. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరైన నహేద్ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చిచంపాడు. అతడి శరీరంలోకి మూడు బులెట్లు దూసుకుపోయాయి. హత్యకు గురైన నహేద్ క్రైస్తవుడు. జోర్డాన్ ప్రభుత్వం నహేద్ కేసు విషయమై మీడియా మీద అంక్షలు విధించింది.అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలతో కలిసి ఐఎస్ వ్యతిరేకంగా జోర్డాన్ పోరాడుతోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







