ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఎన్నారైల ఉత్సాహం.. అపూర్వం

- September 26, 2016 , by Maagulf
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో  ఎన్నారైల ఉత్సాహం.. అపూర్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ప్రవాస భారతీయులు చూపించిన ఉత్సాహం అపూర్వమని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు. ''ఎన్నారై సోదరులు, సోదరీమణులు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చూపిస్తున్న ఉత్సాహం.. హోదాపై పోరులో నా విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మీలో ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు'' అని ఆయన తన ట్వీట్‌లో (@ysjagan) పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్పినా, దాన్ని స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడాన్ని పలువురు ఎన్నారైలతో పాటు విద్యార్థులు కూడా తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే.ఆదివారం రాత్రి ఈ అంశంపై వైఎస్ జగన్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పలు దేశాల నుంచి ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com